ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

    Bheemgal | స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) అన్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా నియమితులైన శెట్టి ప్రేమ్​ చందర్​, పార్టీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ (Party Mandal President Aare Ravinder) శనివారం ఎంపీ అర్వింద్​ను కలిశారు.

    మండలంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళుతున్నారని ఈ సందర్భంగా వారిని ఎంపీ అభినందించారు. మండలంలో ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ యువతను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. వారి వెంట బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఓరుగంటి కిషన్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, నాయకులు తదితరులున్నారు.

    More like this

    Aishwarya Rai | త‌న ఫొటోలు వాడ‌డంపై కోర్టు మెట్లెక్కిన ఐశ్వ‌ర్య‌రాయ్.. ఢిల్లీ హైకోర్టు కీల‌క తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aishwarya Rai | ఐశ్వర్య రాయ్ ... అందం, అభినయంతో ఎంతో మందిని మంత్ర...

    Nizamabad MP | జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదే.. కాంగ్రెస్​కు ఒక్క సీటు రాదు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad MP | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదేనని...

    Telangana Tirumala | తెలంగాణ తిరుమలలో ఎమ్మెల్యే పోచారం పూజలు

    అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (Tirumala Tirupati...