HomeతెలంగాణNizamabad | న్యూట్రిషన్​ పౌడర్​ కలిపిన పాలు తాగి ఆస్పత్రి పాలైన మహిళలు

Nizamabad | న్యూట్రిషన్​ పౌడర్​ కలిపిన పాలు తాగి ఆస్పత్రి పాలైన మహిళలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad | హెర్బల్​ ప్రోడక్ట్స్​ విక్రయం పేరిట ఓ వ్యక్తి మహిళలను మోసం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రూరల్​ పోలీస్​(Rural Police) పరిధిలో గల ముబారక్​ నగర్​(Mubarak Nagar)లో జాబ్​ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటన​ వచ్చింది. దీంతో ఇద్దరు మహిళలు మంగళవారం ఉదయం ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

అక్కడికి వెళ్లాక.. హెర్బల్​ ప్రోడక్ట్స్(Herbal Products)​ విక్రయించాలని నెలకు రూ.15 వేల జీతం ఇస్తామని ఆ వ్యక్తి చెప్పాడు. కస్టమర్లకు ఫోన్​ చేస్తే వారే వచ్చి ప్రోడక్టులు తీసుకు వెళ్తారన్నాడు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూకు వచ్చిన మహిళల్లో ఇద్దరికి బాదం పాలలో వారు విక్రయించాల్సిన న్యూట్రిషన్​ పౌడర్​(Nutrition powder) కలిపి ఇచ్చాడు. ఆ పాలు తాగిన కాసేపటికే సుకన్య, కవిత అనే మహిళలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మహిళల కుటుంబ సభ్యులు వారిని ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital)కి తరలించారు.

Must Read
Related News