Homeక్రైంNizamabad City | బస్​​ డిపో సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

Nizamabad City | బస్​​ డిపో సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని బస్​​ డిపో వెనక ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్​కు ఎదురుగా ఉన్న డిపో పక్కన దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Nizamabad City | అత్యంత రద్దీ ప్రదేశంలో..

నిత్యం వేల సంఖ్యలో ప్రజలు సంచరించే ఈ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. మహిళ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహిళ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోగా.. పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్​ మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే.. ఒకటో టౌన్​ పోలీస్​స్టేషన్​లో (1st Town Police Station) సంప్రదించాలని కోరారు.

Must Read
Related News