అక్షరటుడే, బోధన్ : Navipet | నవీపేట్ మండలంలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. మండలంలోని ఫకీరాబాద్ (Fakeerabad) నుంచి మిట్టాపూర్ వెళ్లి దారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మహిళను వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేశారు. మొండాన్ని ఇక్కడ పడేశారు. ఆమె చేయిని సైతం దుండగులు మణికట్టు వరకు నరికి వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.
