HomeతెలంగాణCyber Fraud | సైబర్​ మోసానికి మహిళ బలి.. యాప్​ల వలలో పడొద్దని సూసైడ్​ నోట్​

Cyber Fraud | సైబర్​ మోసానికి మహిళ బలి.. యాప్​ల వలలో పడొద్దని సూసైడ్​ నోట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు(Cyber ​​Criminals) రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను మాయమాటలతో నమ్మించి.. ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. పార్ట్​ టైం జాబ్స్(Part Time Jobs)​, వర్క్​ ఫ్రం హోమ్​, స్టాక్​ మార్కెట్(Stock Market)​ పేరిట ప్రజలకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాటలు నమ్మి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ మహిళ సైబర్​ వలలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​(Hyderabad)లోని కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్(KPHB Police Station)​ పరిధిలో చోటు చేసుకుంది.

Cyber Fraud | పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనూష

కేపీహెచ్‌బీలో నివాసం ఉంటుంది. ఇటీవల ఆమె సోషల్​ మీడియాలో వర్క్​ ఫ్రమ్​ హోమ్​ యాడ్​ చూసింది. సదరు నంబర్​కు కాల్​ చేయగా.. సైబర్​ నేరగాడు మాయమాటలు చెప్పి ఆమెను మోసం చేశాడు. దీంతో ఆమె సుమారు రూ.లక్ష వరకు పోగొట్టుకుంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అనూష గురువారం ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్​ నోట్​ రాసిన అనూష యాప్‌ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని అందులో కోరింది.

Must Read
Related News