ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పొలం పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

    Kamareddy | పొలం పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ(Kamareddy Municipality) పరిధిలోని సరంపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర కవిత(40) బుధవారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం సరంపల్లి శివారులోని పొలం వద్దకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు(Family Members) వెళ్లి చూడగా చెట్టుకు చీరతో ఉరేసుకుని కనిపించింది.

    పోలీసులకు(Police) సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఒంటిపై పుస్తెలతాడు, ఇతర బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఎవరైనా హత్యాచారం చేశారా అనే అనుమానం గ్రామస్థులు వ్యక్తం చేశారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...