అక్షరటుడే, వెబ్డెస్క్ : Medchal | బైక్పై వెళ్తున్న ఓ మహిళను విద్యుత్ తీగ(Electric Wire) రూపంలో మృత్యువు కబళించింది. ఈదురుగాలులకు విద్యుత్ తీగ తెడిపడటంతో షాక్ కొట్టి మహిళా మృతి చెందింది
ఇదే ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ (Medchal district) జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. సురేశ్, మౌనిక దంపతులు తమ మూడేళ్ల కుమారుడు శ్రేయాస్తో బైక్పై వెళ్తున్నారు. అయితే ఈదురుగాలులకు విద్యుత్ తీగ తెగి వారిపై పడింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందగా.. సురేష్, శ్రేయాస్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.