అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలు కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రైల్వేస్టేషన్ (Nizamabad Railway Station) సమీపంలో ఓ వృద్ధురాలు మృతి చెందిందని స్టేషన్ మేనేజర్ సాగర్ సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించామని.. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని రైల్వే ఎస్సై తెలిపారు. సమాచారం తెలిస్తే రైల్వే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
