ePaper
More
    HomeతెలంగాణEatala Rajendar | ‘కాళేశ్వరం’ కమిషన్​ విచారణకు హాజరవుతా: ఈటల

    Eatala Rajendar | ‘కాళేశ్వరం’ కమిషన్​ విచారణకు హాజరవుతా: ఈటల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Eatala Rajendar | కాళేశ్వరం కమిషన్​(Kaleshwaram Commission) విచారణకు హాజరవుతానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్(Justice PC Ghosh Commission)​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రులు హరీశ్​రావు(Former MLA Harish Rao), ఈటల రాజేందర్​కు నోటీసులిచ్చింది. బీఆర్​ఎస్​ హయాంలో తొలి విడతలో ఈట​ల ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలో జూన్​ 9న విచారణకు హాజరు కావాలని ఈటలకు కమిషన్​ నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరు అవుతానని తెలిపారు.

    Eatala Rajendar | బీఆర్​ఎస్​ నేతలు కలలు కంటున్నారు

    బీఆర్​ఎస్​ నేతలు(BRS Leaders) మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఈటల ఎద్దేవా చేశారు. కాగా.. తాను ఇటీవల హరీశ్​రావును కలిశానని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​గౌడ్(PCC President Bomma Mahesh Goud)​ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను ఎవరినీ కలవలేదని స్పష్టం చేశారు. ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదని ఈ సందర్భంగా ఈటల అన్నారు. ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఏర్పడిందన్నారు. గత పాలనలో ఒక కుంటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని ఈటల అన్నారు. ప్రజల ఆశలను అడియాసలు చేసిన పార్టీలు బీఆర్​ఎస్​, కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు దిక్సూచి బీజేపీ(BJP) అని ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  Bogatha Waterfalls | పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ నయాగరా.. కనుల విందు చేస్తున్న బొగత జలపాతం

    Latest articles

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    More like this

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...