Homeతాజావార్తలుAmberpet Kidnap | భర్తను కిడ్నాప్​ చేయించిన భార్య.. ఎందుకో తెలుసా?

Amberpet Kidnap | భర్తను కిడ్నాప్​ చేయించిన భార్య.. ఎందుకో తెలుసా?

అంబర్​పేటలో కిడ్నాప్​కు గురైన శ్యామ్​ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి పంపకాల్లో తేడా రావడంతో ఆయనను మొదటి భార్య కిడ్నాప్​ చేయించినట్లు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amberpet Kidnap | అంబర్​పేటలో ఇటీవల కిడ్నాప్​కు గురైన రియల్టర్​ మంత్రి శ్యామ్​ కేసును పోలీసులు ఛేదించారు. శ్యామ్​ను ఆయన మొదటి భార్య కిడ్నాప్​ చేయించినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్​ చేశారు.

అంబర్‌పేట్‌కు చెందిన మంత్రి శ్యామ్ (Minister Shyam) కిడ్నాప్ గత నెల 29న కిడ్నాప్​ అయ్యారు. ఆయనను కిడ్నాప్​ చేసి నిందితులు రూ.1.5 కోట్లు డిమాండ్​ చేశారు. బాగ్​అంబర్​పేట డీడీ కాలనీలోని కృష్ణతేజ్ రెసిడెన్సీలో నుంచి ఆయనను కిడ్నాప్​ చేశారు. ఈ మేరకు శ్యామ్​ రెండో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు (police registered case) చేశారు. శనివారం శ్యామ్​ ఎల్బీనగర్​లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి వెళ్లి తీసుకొచ్చారు. అనంతరం కిడ్నాపర్ల కోసం గాలించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Amberpet Kidnap | ఆస్తి కోసం..

అమెరికాలో (America) శ్యామ్​ను మాధవి లత వివాహం చేసుకుంది. వారి మధ్య విభేదాలు రావడంతో శ్యామ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆస్తి తగాదాలతో పాటు ఇతర కారణాలతో భర్త శ్యామ్‌ను మాధవి లత కిడ్నాప్​ చేయించింది. ఈ మేరకు మంగళవారం ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి (DCP Balaswamy) కేసు వివరాలు వెల్లడించారు. శ్యామ్ రెండు నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడన్నారు. ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయంలో తేడా రావడంతో పాటు తనను, పిల్లలను సరిగ్గా చూసుకోవడం లేదని మాధవిలత కిడ్నాప్​కు పథకం రచించింది.

Amberpet Kidnap | పక్కాగా..

మాధవి లత తనకు పరిచయం ఉన్న దుర్గ వినయ్​తో కలిసి కిడ్నాప్​కు ప్లాన్​ చేసింది. దుర్గ వినయ్​తో పాటు సాయి మరో ఇద్దరు యువతులు, మరికొంత మంది కలిసి శ్యామ్​ను కిడ్నాప్​ చేశారు. నిందితులు శ్యామ్​ ఉంటున్న అపార్ట్​మెంట్​లో ఫ్లాట్ అద్దెకి తీసుకొని అతడి కదలికలు గమనించారు. అనంతరం పక్కాగా ఆయనను కిడ్నాప్​ చేశారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు.