ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక మహిళ తన భర్తను చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె తన ప్రేమికుడితో కలిసి భర్తను బెదిరించింది. తన భర్తను చంపి, నీలిరంగు డ్రమ్‌లో పాతిపెడతానని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన భర్త.. తన భార్యకు, ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆలయంలో ఈ వివాహ తంతు జరిగింది. తనను చంపేస్తానని చాలాసార్లు తన పెళ్లాం బెదిరించిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.

    చౌరిచౌరా పోలీస్ స్టేషన్ (Chauri Chaura police station) పరిధిలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక వ్యక్తి పదిహేనేళ్ల క్రితం కుషీ నగర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు సంతానం. బాధిత భర్త పని నిమిత్తం కొన్నాళ్లు వేరే రాష్ట్రానికి వెళ్లాడు.

    READ ALSO  Bank Holidays | ఆగస్టులో బ్యాంకులు పనిచేసేది మూడు వారాలే..

    అతడి భార్య తన పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉండిపోయింది. ఆ టైంలో సమీప గ్రామంలోని ఓ యువకుడితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ వివాహేతర సంబంధానికి దారి తీసింది.

    Uttar Pradesh : భర్తకు తెలియడంతో..

    విషయం తెలిసిన భర్త.. ఆమెను మందలించాడు. కానీ, ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రియుడితో మరింత ఎంజాయ్​ చేయడం మొదలు పెట్టింది. ఒకరోజు పిల్లలను ఇంట్లోనే వదిలేసి, ప్రియుడితో లేచిపోయింది. దీంతో బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    Uttar Pradesh : స్ట్రాంగ్​ వార్నింగ్​..

    దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు లస్ట్ జంటను వెనక్కి పిలిపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత భర్తకు అతడి భార్య స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది. తనకు భర్త అంటే ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఒక వేళ బలవంతంగా ఇంటికి తీసుకెళ్తే.. తన భర్తను చంపేసి, మృతదేహాన్ని డ్రమ్​లో వేసి సిమెంట్​తో నింపేస్తానని బెదిరించింది. ఆ తర్వాత మళ్లీ తన ప్రియుడితో పారిపోతానని చెప్పింది.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు

    Uttar Pradesh : వణికిపోయిన భర్త..

    భార్య ఇచ్చిన స్ట్రాంగ్​ వార్నింగ్​కు భర్త షాక్​ అయిపోయాడు. నిలువెళ్లా వణికిపోయి, ఓ నిర్ణయానికి వచ్చాడు. తన భార్యకు ఓ ఆలయంలో ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించి, ఇద్దరిని పంపించాడు. వారి బాగోతం తెలిసినప్పటి నుంచి తనను ఆమె చంపేస్తానని బెదిరిస్తూ వచ్చిందని బాధితుడు వాపోతూ చెప్పుకొచ్చాడు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...