అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Makloor Mandal | వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్తను హత్య చేసింది. గుండెపోటుతో (heart attack) మృతి చెందాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మాక్లూర్ మండలంలోని బోర్గాం(కె)లో (Borgam(K) village) చోటు చేసుకుంది. మృతుడికి తమ్ముడు ఇజ్రాయిల్ నుంచి తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య బండారం బయటపడింది.
మాక్లూర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్లాటి రమేష్(35)కు కొన్నేళ్ల క్రితం సౌమ్యతో వివాహం జరిగింది. అయితే ఆమెకు నందిపేట్ మండలం (Nandipet mandal) బాద్గుణకు చెందిన దిలీప్తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త రమేష్ పలుమార్లు భార్యను హెచ్చరించారు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఆమె ప్రియుడితో పన్నాగం పన్నింది. ఈ మేరకు గతేడాది ఆగస్ట్లో రమేష్ ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తుండగా కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నంచారు. ఈ ఘటనలో రమేష్ కారుతో ఢీకొట్టిన వారిపై ఫిర్యాదు చేయగా కేసు సైతం నమోదైంది. అయితే రమేష్ ఈ ఘటనలో మృతి చెందకపోవడంతో మళ్లీ డిసెంబర్లో అతడిని హత్య చేసేందుకు సౌమ్య ప్రణాళిక వేసింది.
Makloor Mandal | సుపారీ గ్యాంగ్కు డబ్బులిచ్చి..
రమేష్ను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించిన సౌమ్య తన ప్రియుడు దిలీప్తో మరోసారి ప్లాన్ వేసింది. ఈ క్రమంలో తన గోల్డ్ రింగ్ను ప్రియుడికి ఇవ్వగా అతడు ఓ ఫైనాన్స్లో కుదువ పెట్టి రూ.35వేలు తీసుకొచ్చాడు. అనంతరం దిలీప్ తన తమ్ముడు అభిషేక్ను సంప్రదించగా అతడు బంటు జితేందర్, కెలేత్ శ్రీరాం, రమావత్ రాకేష్, మోసిన్లతో గ్యాంగ్ తయారు చేశాడు. వీరికి మొదటి విడతగా డిసెంబర్ 16వ తేదీన రూ.25వేలు అందించాడు. మిగితా రూ.15వేలు రమేష్ హత్య చేశాక ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.
Makloor Mandal | మత్తుమందు కలిపి..
డిసెంబర్19వ తేదీ రాత్రి భార్య సౌమ్య తన భర్త భోజనంలో మత్తు మందు కలిపింది. దీంతో అతడు నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే ఆమె దిలీప్కు ఫోన్ చేయగా దిలీప్ సుపారి గ్యాంగ్ సభ్యుడికి ఫోన్ చేశాడు. కానీ వారు ఆ సమయంలో స్పందించకపోవడంతో తానే హత్య చేసేందుకు దిలీప్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో దిలీప్ తన తమ్ముడు అభిషేక్తో కలిసి సౌమ్య ఇంటికి వచ్చాడు. నిద్రలో ఉన్న రమేష్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి వెళ్లిపోయారు. అనంతరం ఉదయం సౌమ్య తన భర్త రమేష్ హార్ట్ ఎటాక్తో చనిపోయాడని రోదిస్తూ అందరినీ నమ్మించింది.
ఈ సందర్భంగా అదేరోజు సాయంత్ర అంత్యక్రియలు సైతం పూర్తిచేశారు. కాని ఈ విషయమై ఇజ్రాయిల్లో ఉంటున్న రమేష్ తమ్ముడికి అనుమానం రాగా తన భార్యతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు విచారణ చేయగా మృతుడి భార్య సౌమ్య బండారం బయటపడింది. అనంతరం పోలీసులు హత్యలో పాల్గొన్న సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్, తమ్ముడు అభిషేక్లతోపాటు సుపారీ తీసుకున్న గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్లో మోసిన్ పరారీలో ఉన్నాడు.
ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ పీఎసీ ఎస్సై రాజశేఖర్ కేసు ఛేదనలో పాల్గొన్నారు. నిందితులను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, పీసీలు చందు, బాలాలింగం, రాకేశ్, రామకృష్ణ, శ్రీనివాస్, శ్రీకర్ గౌడ్, లక్ష్మీప్రసన్న, రచిత, బాబునాయక్, శ్రీకాంత్ గౌడ్, దత్తాద్రి గౌడ్, వెంకటస్వామి, సురేంధర్, చరణ్లను ఏసీపీ రాజా వెంకట్రెడ్డి అభినందించారు.
