HomeUncategorizedTamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ హత్యకు మూడేళ్ల కూతురే సాక్ష్యంగా నిలిచింది. ఆ చిన్నారి ఇచ్చిన సమాచారంతో పోలీసులు హత్య కేసును ఛేదించారు.

వేలూరు Vellore లో భరత్ అBharat నే వ్యక్తి ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, కూతురితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి భరత్​ను పొడిచి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మొదట గుర్తుతెలియని వ్యక్తుల దాడిగా భావించారు. కానీ, విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగుచూశాయి. నిందితులైన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Tamil Nadu : ఏమి జరిగిందంటే..

వేలూరు జిల్లా ఒడుకత్తూర్‌ వద్ద కుప్పంపాళ్యంలో చోటుచేసుకుందీ ఘటన. ఈ గ్రామానికి చెందిన భారత్‌(36) చెన్నైలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్​గా పనిచేస్తున్నాడు. కాగా, భరత్​కు బెంగళూరుకు చెందిన నందిని(26)తో ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు(4, 3 వరుసగా ఏళ్ల వయస్సు) ఉన్నారు.

చెన్నైలో పనిచేసే భరత్​.. భార్యాపిల్లలను చూసేందుకు ప్రతి వారం సెలవు రోజుల్లో గ్రామానికి వచ్చేవాడు. అలా ఈ నెల (జులై) 21న భరత్​ ఇంటికొచ్చాడు. సరకుల కోసం భార్య, చిన్న కూతురి daughter ని తీసుకుని బైక్‌పై దుకాణానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై అడ్డంగా ఉన్న కొబ్బరిమట్టలను తట్టుకుని అదుపుతప్పి పడిపోయాడు.

కాగా, అక్కడే మాటువేసిన ఓ దుండగుడు పదునైన కత్తితో భారత్‌పై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భరత్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భరత్ భార్య నందిని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మెల్లిగా చిన్న కుమార్తెను ఆరా తీశారు. దీంతో ఆ చిన్నారి.. నాన్నపై సంజయ్‌ మామ దాడి చేసినట్లు చెప్పింది. వెంటనే నందినిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. బండారం అంతా వెలుగుచూసింది.

Tamil Nadu : వివాహేతర సంబంధం..

భరత్​ పని నిమిత్తం చెన్నై Chennai వెళ్తుండటంతో నందిని Nandini ఇంట్లో పిల్లలతో ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో వీరి ఇంటి ఎదురుగా ఉండే సంజయ్​(21)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బండారం తెలిసి, భార్యను భారత్‌ హెచ్చరించాడు. దీంతో అతడిపై పగ పెంచుకున్న భార్య, ప్రియుడు.. భరత్​ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అలా పక్కా ప్రణాళిక వేసుకుని, దాని ప్రకారమే భరత్​ను ఇరువురు కలిసి కడతేర్చారు. కానీ, కూతురి సాక్ష్యంతో చేసిన పాపం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు Police.. నిందితులను కోర్టులో హాజరుపర్చి, రిమాండ్​కు తరలించారు.