అక్షరటుడే, బీర్కూర్: Birkur | బీర్కూర్ మండలం రైతునగర్ (Raithunagar) గ్రామ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై కిష్టాపూర్కు (Kistapur) వెళ్తుండగా రైతునగర్ వద్ద ఆటో ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
భార్య శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రైవేట్ వాహనంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి (Banswada Area Hospital) తరలించారు. మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. భర్త సాయాగౌడ్కు రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయనను నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
