Homeక్రైంPothangal mandal | భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

Pothangal mandal | భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే,కోటగిరి : Pothangal mandal | భర్త మందలించాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పోతంగల్​ మండల (Pothangal mandal) కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది.

పోతంగల్ ఎస్సై సునీల్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సాయిలు, సూదాం గంగామణి భార్యాభర్తలు. ఇంటి ఎదుట పాతిన ఓ కర్ర విషయంలో వీరికి వాగ్వాదం జరిగింది. భర్త మందలించడంతో మనస్థాపం చెందిన గంగామణి మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. బుధవారం చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. కొడుకు సతీష్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.