HomeతెలంగాణCM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటన (Delhi Tour)లో ఉన్న ఆయన బుధవారం మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత ఫోన్​ కూడా ట్యాప్​ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో చిట్​చాట్​లో రేవంత్​రెడ్డి మాట్లాడారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం మేలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

CM Revanth | మొదట ఫిర్యాదు చేసింది ఆయనే..

ఫోన్ ట్యాపింగ్‌పై మొదట ఫిర్యాదు చేసింది ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ (RS Praveen Kumar)​ అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందన్నారు. సిట్​ అధికారులను తాను నిర్దేశించనని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్​పై మొదట ప్రభుత్వం కేసు పెట్టలేదన్నారు. సామగ్రి మిస్సింగ్​పై కేసు పెట్టిందన్నారు. అయితే లోతుగా విచారిస్తే ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని సీఎం పేర్కొన్నారు.

CM Revanth | నోటీసులు వస్తే విచారణకు వెళ్తా..

ఫోన్ ట్యాపింగ్ చట్టవ్యతిరేకం కాదని సీఎం అన్నారు. అయితే పర్మిషన్ తీసుకుని చేయాలని తెలిపారు. తన ఫోన్​ ట్యాపింగ్​ కాలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. ట్యాపింగ్​ అయి ఉంటే.. సిట్ (SIT) అధికారులు తనను పిలిచేవారన్నారు. ఒకవేళ విచారణ నోటీసులు ఇస్తే హాజరు అవుతానని ఆయన తెలిపారు.

Must Read
Related News