అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ (Chander Nayak) సూచించారు. మంగళవారం పెద్ద కొడప్గల్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంతరెడ్డి, మండల ప్రత్యేకాధికారి కిషన్, ఏపీవో సుదర్శన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
