అక్షరటుడే , భీమ్గల్ : Mallela Rajashree | భీమ్గల్ మున్సిపాలిటీలోని (Bheemgal Municipality) 9వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ పేర్కొన్నారు. వార్డు పరిధిలో సోమవారం ముమ్మరంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ‘హస్తం’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
Mallela Rajashree | అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం
గతంలో తాను కౌన్సిలర్గా, మున్సిపల్ ఛైర్మన్గా (Municipal Chairman) పనిచేసిన అనుభవంతో వార్డులో నెలకొన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని రాజశ్రీ తెలిపారు. గత హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, మరోసారి అవకాశం ఇస్తే వార్డు రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. స్థానికురాలిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, డ్రెయినేజీ, తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు.
Mallela Rajashree | అధికార పార్టీతోనే సాధ్యం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలో ఉన్నందున, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే నిధుల రాక సులువవుతుందని ఆమె వివరించారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో భీమ్గల్ పట్టణంతో పాటు 9వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇతర పార్టీలకు ఓటు వేసి అభివృద్ధిని దూరం చేసుకోవద్దని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.