Homeజిల్లాలునిజామాబాద్​DGP Shivdhar Reddy | కానిస్టేబుల్​ కుటుంబానికి అండగా ఉంటాం: డీజీపీ

DGP Shivdhar Reddy | కానిస్టేబుల్​ కుటుంబానికి అండగా ఉంటాం: డీజీపీ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: DGP Shivdhar Reddy | రౌడీ షీటర్​ రియాజ్​ (rowdy sheeter Riyaz) దాడిలో మరణించిన ప్రమోద్​ కుటుంబానికి పోలీస్​ శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivdhar Reddy) తెలిపారు. ప్రమోద్​ కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం నిజామాబాద్​ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

కానిస్టేబుల్ ప్రమోద్ (constable Pramod) కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అలాగే ప్రమోద్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం అందజేస్తున్నామని వివరించారు. కానిస్టేబుల్​ ప్రమోద్​ విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండేవాడన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండేవాడని వివరించారు. అయితే కేసు విచారణలో ఉండగా ఇతర విషయాలు మాట్లాడడం లేదని చెప్పారు.

DGP Shivdhar Reddy | ఆసిఫ్​ కుటుంబానికి రూ. 50వేలు

నేరస్తుడు రియాజ్​ను పట్టుకోవడంలో సహకరించిన ఆసిష్​కు రూ. 50 వేల రివార్డు అందజేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఆసిఫ్ ప్రాణాలకు తెగించి రియాజ్ ను పట్టుకున్నాడని వివరించారు. ఆసిఫ్ సహకారంతోనే కేసును ఛేదించగలిగామని పేర్కొన్నారు. బాధితుడు ఆఫీస్​కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. సమావేశంలో ఇంటలిజెన్స్​ అడిషనల్​ డీజీ విజయ్​ కుమార్ (Additional DG Vijay Kumar)​, డీఐజీ చంద్రశేఖర్​ రెడ్డి, సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పాల్గొన్నారు.