ePaper
More
    HomeతెలంగాణPashamylaram | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Pashamylaram | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​(PCC Chief Mahesh Goud) అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్​ పేలుడు(Reactor Explosion) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

    Pashamylaram | 13 మంది ఆచూకీ గల్లంతు

    రియాక్టర్​ పేలుడు దాటికి పలు భవనాలు కూలిపోయాయి. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు కంపెనీలోని 13 మంది ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శిథిలాల కింద వారు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    READ ALSO  New Ration Cards | కొత్త రేషన్​ కార్డుల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

    Pashamylaram | పరిశీలించిన మీనాక్షి నటరాజన్​

    కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​(Meenakshi Natarajan) మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఫ్యాక్టరీని పరిశీలించి మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ ఫ్యాక్టరీని పరిశీలించారు. సీఎం రేవంత్​ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఈ ఘటనపై రాహుల్​ గాంధీ(Rahul Gandhi) విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

    Pashamylaram | కంపెనీ యాజమాన్యంపై కేసు

    పాశమైలారం(Pashamylaram) సిగాచి కంపెనీలో రియాక్టర్​ పేలుడుకు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బాధితుల రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. మరోవైపు పరిహారం విషయంలో కూడా కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

    READ ALSO  Pod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...