Pawan Kalyan | కొబ్బరి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | కొబ్బరి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ అన్నారు. కోనసీమ జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. కేశనపల్లి (Keshanapalli)లో కొబ్బరి చెట్లను పరిశీలించారు. సముద్ర జలాలలో లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో పవన్​ (Pawan Kalyan) రైతులతో మాట్లాడారు. ఉప్పు నీటితో కొబ్బరి చెట్లు చనిపోతున్నా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | కొబ్బరి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ అన్నారు. కోనసీమ జిల్లాలో బుధవారం ఆయన పర్యటించారు. కేశనపల్లి (Keshanapalli)లో కొబ్బరి చెట్లను పరిశీలించారు.

సముద్ర జలాలలో లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో పవన్​ (Pawan Kalyan) రైతులతో మాట్లాడారు. ఉప్పు నీటితో కొబ్బరి చెట్లు చనిపోతున్నా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కోనసీమ కొబ్బరి రైతులకు (Konaseema Coconut Farmers) శాశ్వత పరిష్కారం కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్​ పాలనలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతోందని చెప్పారు.తాను కోనసీమ రైతుల గొంతునవుతానని పవన్​ అన్నారు.

అన్నదాతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే పర్యటనకు వచ్చానని చెప్పారు. శంకరగుప్తం డ్రైన్​తో తాగునీటి జలాలు ఉప్పగా మారాయన్నారు. డ్రైన్​ ఆధునికీకరణకు రూ.4 వేలు కోట్లు అవసరం అని ఆయన పేర్కొన్నారు. కొందరు రైతులు తనను సినిమా తీసి డబ్బులు ఇవ్వమంటున్నారని పవన్​ చెప్పారు. అయితే డబ్బులు ఎవరి జేబులో నుంచి ఇచ్చేవి కావన్నారు. ఉన్న డబ్బంతా పథకాలకు ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కోనసీమ జిల్లా రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్​లో మరోసారి పర్యటిస్తానని చెప్పారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...