అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BC JAC | రేపటి బంద్తో బీసీల తడాఖా చూపిస్తామని కామారెడ్డి బీసీ జేఏసీ (Kamareddy BC JAC) తెలిపింది. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో శుక్రవారం బీసీ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేపు జరగబోయే బీసీ జేఏసీ బంద్లో (BC JAC bandh) సబ్బండ వర్గాలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు.
Kamareddy BC JAC | స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలి
విద్య, కిరాణ, వాణిజ్య, వర్తక, ఆటో సంఘాలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ నాయకులు కోరారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించి గ్రామస్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు నిరసనలు తెలిపి బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో, ఎన్జీవో, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుల మద్దతు కోరుతూ వినతిపత్రాలు సమర్పించడం జరిగిందన్నారు.
‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో (political sectors) సాధించే వరకు నిరంతరం ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ బంద్ ద్వారా బీసీల సత్తా ఏమిటో ఢిల్లీకి సెగ తగిలేలా నిరూపిస్తామని పేర్కొన్నారు. రేపటి బంద్ కోసం ఉద్యమ స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీజేఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్, ప్రజాపంత్, ఎల్హెచ్పీఎస్ నాయకులు పాల్గొని విజయవంతం కోసం ప్రణాళికా రచించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, పండ్ల రాజు, కుంబాల రవి, నాగరాజ్ గౌడ్, మర్కంటి భూమన్న, కొత్తపల్లి మల్లన్న, గైని శ్రీనివాస్ గౌడ్, కన్నయ్య, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.