ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Diesel vehicles | డీజిల్‌ వాహనాలను నగరం బయటకు పంపిస్తాం: సీఎం రేవంత్​రెడ్డి

    Diesel vehicles | డీజిల్‌ వాహనాలను నగరం బయటకు పంపిస్తాం: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Diesel vehicles | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కాలుష్యం తగ్గించడానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.

    శనివారం ఆయన పీజేఆర్​ ఫ్లై ఓవర్ (PJR Flyover)​ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్​లో నగరంలో జనాభా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్​ తరాలు నగరంలో జీవించలేవని.. అందుకే కాలుష్య నివారణ కోసం చర్యలు చేపడుతామన్నారు. ఇందులో భాగంగా డీజిల్​ వాహనాల (Diesel vehicles)ను నగరానికి అవతలకు పంపించే చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.

    Diesel vehicles | గుణపాఠం నేర్చుకోవాలి

    ప్రస్తుతం కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నివసించలేని పరస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అలాగే వర్షం వస్తే చెన్నై నగరం నీట మునుగుతుందన్నారు. బెంగళూరువాసులు ట్రాఫిక్​ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని సీఎం సూచించారు.

    READ ALSO  CM Revanth Reddy | ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్‌కి రూ. కోటి న‌జరానా

    Diesel vehicles | ఎలక్ట్రిక్​ ఆటోలు కొనండి

    నగరంలోని డీజిల్ వాహనాలను తొలగిస్తామని సీఎం అన్నారు. నగరంలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు కూడా డీజిల్​ ఆటోలను తీసేసి ఎలక్ట్రిక్​ ఆటోలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున కూడా ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్​ ఆటోలు కొంటే సాయం చేయడానికి చర్యలు చేపడుతామన్నారు. అలాగే ట్యాక్సీలు, ఇతర వాహనదారులు కూడా డీజిల్​ బండ్లను తీసేయాలని ఆయన సూచించారు. ఎలక్ట్రిక్​ వాహనాలు (Electric vehicles) కొనేవారికి పన్ను రద్దు చేసినట్లు సీఎం గుర్తు చేశారు.

    Diesel vehicles | నాలాల కబ్జాతోనే ముంపు

    నగరంలోని నాలాలు కబ్జా అవడంతోనే వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని సీఎం తెలిపారు. దీంతో చెరువులు, నాలాల రక్షణకు హైడ్రా (Hydraa) ఏర్పాటు చేశామన్నారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చి వేసిందన్నారు. వరద నీళ్లు వెళ్లేందుకు చెరువుల్లేకుండా కొందరు కబ్జాలు చేశారని సీఎం పేర్కొన్నారు. బతుకమ్మకుంటను బీఆర్​ఎస్ నాయకులు (BRS Leaders) ఆక్రమించుకుంటే కబ్జా నుంచి విడిపించామని సీఎం తెలిపారు.

    READ ALSO  Fake Liquor | కల్తీ మద్యానికి బ్రాండెడ్​ స్టిక్కర్లు.. బెల్ట్​ షాపులే లక్ష్యంగా విక్రయాలు

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...