అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pension Schemes | పింఛన్లు (Pensions) పెంచి ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్ఛార్జి మంథని సామ్యూల్ అన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి మండల తహశీల్దార్ కార్యాలయం (Tahsildar Office) ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా సామ్యూల్ (Manthani Samuel) మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం పింఛన్లను పెంచలేదన్నారు. వెంటనే వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులు వితంతువులు చేయూత పింఛన్దారులకు రూ.4 వేల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Pension Schemes | రేపు నాందేడ్లో..
రేపు నాందేడ్ జిల్లా దెగ్లూర్కు సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ వస్తున్నారని.. సభను విజయవంత చేయాలని సామ్యూల్ కోరారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి వికలాంగులు, వృద్ధులు, వితంతువులను గీత, నేత, బీడీ కార్మికులను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ నాయకులు సతీష్, సీనియర్ నాయకులు కంతి పద్మారావు, మండల అధ్యక్షుడు రామగల్ల శివానందం, పౌలయ్య, అంబయ్య, రాములు, చంటి తదితరులు పాల్గొన్నారు.