అక్షరటుడే, ఇందూరు: Desk Journalists | తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని డెస్క్ జర్నలిస్టులు (Desk journalists) గొంతెత్తారు. అక్రెడిటేషన్లలో (accreditations) కోత విధించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం డెస్క్ జర్నలిస్టులు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జీవో 252 ద్వారా డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అక్రెడిటేషన్, మీడియా కార్డుల పేరుతో జర్నలిస్టులను విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలిపేందుకు ఈ నెల 27న ఛలో కలెక్టరేట్ కార్యక్రమం (Chalo Collectorate program) నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
Desk Journalists | అడ్హక్ కమిటీ ఏర్పాటు
డెస్క్ జర్నలిస్టులకు చేసిన అన్యాయంపై పోరాటం చేసేందుకు అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్గా భీంరావు, కో–కన్వీనర్లుగా నరేంద్ర స్వామి, సందీప్, అశోక్రెడ్డి, రాకేష్, శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యచరణపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.