MP Arvind | నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం: ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, ఇందూరు : MP Arvind | నిజామాబాద్ (Nizamabad) పేరును ఇందూరుగా మారుస్తామని ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పేరు మార్పు డిమాండ్​ ఎప్పటి నుంచో ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Municipal Corporation Elections) ఈసారి గెలుపు బీజేపీదేనని ఎంపీ అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మున్సిపల్​ పీఠం కొంతలో చేయి జారిందన్నారు. ఎన్నో […]

అక్షరటుడే, ఇందూరు : MP Arvind | నిజామాబాద్ (Nizamabad) పేరును ఇందూరుగా మారుస్తామని ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పేరు మార్పు డిమాండ్​ ఎప్పటి నుంచో ఉందన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Municipal Corporation Elections) ఈసారి గెలుపు బీజేపీదేనని ఎంపీ అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మున్సిపల్​ పీఠం కొంతలో చేయి జారిందన్నారు. ఎన్నో పథకాలు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయడం లేదన్నారు. పనిచేయని ప్రభుత్వాలకు ఓటు వేయొద్దన్నారు. గత పదేళ్లలో నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గుర్తు చేశారు.

MP Arvind | గ్రామాభివృద్ధి కోసమే జీ రాం జీ చట్టం

గ్రామాభివృద్ధి కోసమే జీ రాం జీ ఉపాధి హామీ పథకం మార్పు జరిగినట్టు ఎంపీ తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం చట్టాన్ని రూపొందించారని.. దీనిని వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్​కు ఇబ్బంది బీజేపీతోనా..రాముడితోనా.. లేదా కేంద్ర ప్రభుత్వంతోనా అనేది స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. గతంలో వంద రోజులు పని రోజులు ఉంటే దాన్ని 125 రోజులకు పెంచామన్నారు. ప్రధానంగా ఆదివాసీలకు ఎస్టీలకు మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉందన్నారు. నూతన చట్టంతో ప్రతివారం నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు.

MP Arvind | రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉండాలని..

రాష్ట్ర ప్రభుత్వం (State Government) మీద బాధ్యత ఉండేందుకు 40 శాతం నిధులు కేటాయించేలా చట్టం రూపొందించామన్నారు. పనిచేయని ప్రభుత్వాలకు ఈ చట్టం ఇబ్బందికరంగా ఉందన్నారు. వ్యవసాయ పనులకు సైతం ఉపాధి హామీ కింద పనిచేసుకోవచ్చని వివరించారు. నిరుద్యోగులకు ఈ పథకం ఉపాధినిస్తుందని చెప్పారు. గ్రామ అభివృద్ధికి నిరుద్యోగులకు ఉపయోగపడే పథకంపై రాజకీయాలు చేయొద్దని కోరారు.  పథకంపై జీవో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తగదన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.