HomeUncategorizedRajnath Singh | నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తాం : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్

Rajnath Singh | నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తాం : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajnath Singh | ఆదివాసీలను పట్టి పీడిస్తున్న నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాథ్​నాథ్​ సింగ్ (Union Minister Rajnath Singh)​ అన్నారు. నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో శుక్రవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్​నాథ్​ సింగ్​ హాజరై మాట్లాడారు.

అల్లూరి సీతారామరాజు విప్లవం కేవలం యావత్ భారతానికి వ్యాపించిందన్నారు. అల్లూరి శౌర్యం, వీరత్వం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భయపడేలా చేసిందని పేర్కొన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో ఆయన ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటిష్​ సైనికులను ముచ్చెమటలు పట్టించారని కొనియాడారు. ఆదివాసీల హక్కులను కాలరాసిన బ్రిటీష్ వారికి సరైన బుద్ధి చెప్పారన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Rajnath Singh | మన బలమేంటో చూపించాం

ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్తాన్​లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ ఆపరేషన్​ చేపట్టామన్నారు. ఈ ఆపరేషన్​తో దాయాది దేశంతో పాటు ప్రపంచానికి మన బలం ఏమిటో చూపెట్టామని ఆయన పేర్కొన్నారు.