HomeతెలంగాణRed Cross Society | రక్తదానంతో ప్రాణదాతలు కావాలి

Red Cross Society | రక్తదానంతో ప్రాణదాతలు కావాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డీఈవో అశోక్(DEO Ashok) అన్నారు. రెడ్​క్రాస్​ సొసైటీ (Red Cross Society) ఆధ్వర్యంలో గురువారం నగరంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలలో (Kotagalli Girls’ High School) రక్తదాన శిబిరం (Blood donation camp) ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రక్తదానం చేయడం అభినందనీయమని, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సాయి రెడ్డి, రెడ్​క్రాస్ సొసైటీ ఛైర్మన్ ఆంజనేయులు, సభ్యులు తోట రాజశేఖర్, రవి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.