Savitribai Phule | సావిత్రిబాయి ఫులే బాటలో నడవాలి : మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​

అక్షరటుడే, ఇందూరు: Savitribai Phule | మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని నమ్మి వారి ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే అని నిజామాబాద్​ మాజీ మేయర్​, మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangham) జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay)​ పేర్కొన్నారు.  సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. Savitribai Phule | […]

అక్షరటుడే, ఇందూరు: Savitribai Phule | మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని నమ్మి వారి ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే అని నిజామాబాద్​ మాజీ మేయర్​, మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangham) జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay)​ పేర్కొన్నారు.  సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.

Savitribai Phule | ధీరవనిత సావిత్రిబాయి పూలే..

ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా హాజరైన ధర్మపురి సంజయ్​ మాట్లాడుతూ.. బాలికలు చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి ఫులే అని అన్నారు. ఆనాటి సమాజంలో కట్టుబాట్లను ఎదురించి బాలికలను చదువు చెప్పేందుకు బయటకు వచ్చిన ధీర వనిత ఆమె అని పేర్కొన్నారు. సావిత్రిబాయి ఆనాడు వేసిన ధైర్యమైన అడుగులే నేటి మహిళలకు ఆదర్శంగా మారాయన్నారు. సావిత్రిబాయి ఆనాడు తీసుకున్న ధైర్యమైన నిర్ణయం కారణంగానే నేటి మహిళలు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారన్నారు.

Savitribai Phule | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం అభినందనీయం..

మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా మున్నూరు కాపు సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్ పటేల్ వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్​ రవి పటేల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గౌరవ అతిథులుగా డాక్టర్ దేవకీదేవి, సహాయ ఆచార్యులు డాక్టర్ సుమలత హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, సలహాదారులు అబ్బాయి లింబాద్రి పటేల్, చిట్టి నారాయణరెడ్డి పటేల్, కోశాధికారి బాశెట్టి సురేష్ పటేల్, కార్యవర్గ సభ్యులు మోహన్, పాల జనార్ధన్, సాయికుమార్, చల్ల సత్యనారాయణ పటేల్, అర్జున్, శేఖర్ పటేల్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 మంది మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రంతో పాటు మెమోంటోలు అందజేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Kalvakuntla Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ : కల్వకుంట్ల కవిత

జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు

Kamareddy Yellow Alert | కామారెడ్డికి ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Yellow Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి (Kamareddy), కొమురం భీం...

Municipal Election Shock | బీజేపీ, బీఆర్​ఎస్​లకు మున్సిపల్​ ఎన్నికలు షాక్​ ఇచ్చాయి : మానాల మోహన్​రెడ్డి

మున్సిపల్​, జీపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​లకు షాక్​ తగిలిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Kamareddy Land Dispute | రాజకీయ లబ్ధి కోసమే కళాశాల ఆస్తుల వివాదం: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కళాశాల ఆస్తుల వివాదాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేవీఆర్​ అన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఆయన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.