అక్షరటుడే, వెబ్డెస్క్ : Budget Sessions | రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులను పెంచినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశీయ ఉత్పత్తి రెండున్నర లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి (Droupadi Murmu) ప్రసగించారు. మైక్రోచిప్ రంగంలో ఆత్మ నిర్భరత అవసరముందని ఆమె పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రిటికల్ మినరల్ మిషన్తో ఖనిజాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు.
Budget Sessions | వికసిత్ భారత్ లక్ష్యంగా..
వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ముర్ము తెలిపారు. నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, 10 కోట్ల కుటుంబాలకు కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు (LPG Gas Connections) ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో, ఆక్వా రంగంలో రెండో స్థానంలో నిలిచామని వెల్లడించారు. ఉత్పత్తి రంగంలో అనేక సంస్కరణలు చేపట్టడంతో ఎగుమతులు పెరిగాయన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని పేర్కొన్నారు.
Budget Sessions | ఆదాయ పన్నులో సంస్కరణలు
ఇన్కమ్ ట్యాక్స్లో కీలక సంస్కరణలు తెచ్చినట్లు రాష్ట్రపతి తెలిపారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని పెంచామని చెప్పారు. త్వరలో భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)తో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు. కేంద్రం చేపట్టిన చర్యలతో మావోయిస్టుల ప్రభావం 126 జిల్లాల నుంచి 8 జిల్లాలకు తగ్గిందన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు.