ePaper
More
    HomeజాతీయంAdampur Air Base | శత్రువుకు నిద్ర లేకుండా చేశాం : ప్రధాని మోదీ

    Adampur Air Base | శత్రువుకు నిద్ర లేకుండా చేశాం : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adampur Air Base | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi పాకిస్తాన్​కు మరోసారి మాస్​ వార్నింగ్​ ఇచ్చారు. భారత్​ వైపు కన్నెత్తి చూస్తే జరిగిదే వినాశనమే అని ఆయన హెచ్చరించారు. పంజాబ్​లోని ఆదంపూర్​ ఎయిర్​బేస్ Adampur Air Base ​ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​లో జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘మీరందరూ ప్రతీ భారతీయుడు ఉప్పొంగేలా చేశారు.. దేశం అంతా మీ వెంట ఉంది. మీరందరూ చరిత్ర సృష్టించారు. మీ దర్శనం కోసం నేను వచ్చనని’’ మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని కొనియాడారు.

    Adampur Air Base | ఇంట్లోకి చొచ్చుకెళ్లి దాడి చేశాం

    ఉగ్రవాదులు పిరికిపందల్లా దాక్కొని వచ్చి అమాయకులపై దాడి చేశారని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్​ సిందూర్​ operation sindoor చేపట్టినట్లు పేర్కొన్నారు. 15 నిమిషాల్లోనే సరిహద్దు అవతల ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. పాక్​ డీలా పడిపోయిందని, ఎప్పుడు దాడి జరిగిందో కూడా కనిపెట్టలేక పోయిందన్నారు. మన ఆడబిడ్డల సిందూరం దూరం చేసిన వారి ఇంట్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేశామన్నారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులకు ఆయన సెల్యూట్​ చేశారు.

    Adampur Air Base | పాక్​ ఆయుధాలు తేలిపోయాయి..

    మనం ఉగ్రవాదులపై దాడులు చేస్తే పాకిస్తాన్​ ప్రజలు, మిలటరీ స్థావరాలపై దాడులకు యత్నించిందని మోదీ పేర్కొన్నారు. వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు, యూఏవీలతో దాడులకు పాల్పడిందన్నారు. అయితే మన ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ వాటిని అడ్డుకుందని తెలిపారు. మన రక్షణ వ్యవస్థ ముందు పాక్​ ఆయుధాలు తేలిపోయాయని ఎద్దేవా చేశారు. అదే సమయంలో మన మిసైళ్లు పాక్​లోని లక్ష్యాలను ఛేదించాయని తెలిపారు. ఈ ఆపరేషన్​ సమయంలో త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయని మోదీ అభినందించారు.

    Adampur Air Base | వారి తరహాలోనే జవాబు

    ఆపరేషన్‌ సిందూర్‌ సాధారణమైన సైనిక విన్యాసం కాదని, ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనమని మోదీ అభివర్ణించారు. ఉగ్రదాడులు చేసే వారికి, వారి తరహాలోనే జవాబు ఇస్తామన్నారు. అణ్వాయుధాల పేరిట బ్లాక్​మెయిల్​ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిని ఒకేలాగా చూస్తామని మోదీ స్పష్టం చేశారు. మన సామర్థ్యం చూసి పాకిస్తాన్​కు కొన్ని రోజులు నిద్ర పట్టదని మోదీ అన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...