HomeUncategorizedOperation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక...

Operation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ రాహుల్‌ ఆర్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాలను యుద్ధ రంగంలో ఓడించామని ఆయన తెలిపారు. ఫిక్కి నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ (New Age Military Technologies) కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూరు(Operation Sindoor) చేపట్టి పాక్​, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్​ దెబ్బతో షాకైన పాక్​ తర్వాత డ్రోన్లు, క్షిపణులతో భారత్​పై దాడులు చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను అడ్డుకుంది.

Operation Sindoor | ఆ దేశాలను ఓడించాం

ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాకిస్తాన్​(Pakistan)కు తుర్కీయే డ్రోన్లను సరఫరా చేసింది. చైనా కూడా ఆయుధాలు అందించినట్లు సమాచారం. పాక్​ పలు చైనా క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తాజాగా రాహుల్‌ ఆర్‌సింగ్‌(Rahul R Singh) మాట్లాడుతూ.. పాక్‌తో పాటు చైనా, తుర్కియేను ఓడించామన్నారు.
చైనా పాకిస్తాన్‌ను లైవ్‌ ల్యాబ్‌లా వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్​ ప్రయోగించిన పలు చైనా మిసైళ్లు(Chinese Missiles) పని లక్ష్యాన్ని చేరుకోకముందే కూలిపోయాయి. అలాగే చైనా నుంచి పాక్​ కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత దాడులను అడ్డుకోలేకపోయింది. అదే సమయంలో భారత్​ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 సిస్టమ్​ సమర్థవంతంగా పని చేసింది. ఈ క్రమంలో డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు చేశారు. తుర్కియే పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా పాకిస్తాన్‌కు ప్రత్యక్ష కార్యాచరణ డేటాను అందించిందని, భారత్​పై నిఘా ఉంచిందని ఆయన తెలిపారు.