అక్షరటుడే, నిజాంసాగర్ : Mla Laxmi Kantha Rao | గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘పనుల జాతర’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Mla Thota Laxmi Kantha Rao) తెలిపారు. జుక్కల్ మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో శుక్రవారం పనులజాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర నిర్వహిస్తోందన్నారు. ఈ మేరకు రూ. 2,198.83 కోట్ల వ్యయంతో 1,01,589 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
Mla Laxmi Kantha Rao | పనుల జాతరలో..
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, పొలాలకు మట్టి రోడ్లు, చెక్ డ్యామ్లు, ఊట కుంటల నిర్మాణం, గ్రామీణ రోడ్లు, పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాల నిర్మాణం, నర్సరీల పెంపకం, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల (Gram Panchayat Buildings) నిర్మాణాలు తదితర పనులు చేపడతామన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖండేబల్లూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోవింద్ (Deputy Sarpanch Govind) ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. అనంతరం గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.