Homeక్రైంCI suspended | చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు.. సీఐ సస్పెన్షన్​

CI suspended | చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు.. సీఐ సస్పెన్షన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CI suspended | తొమ్మిది ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తిపై పోలీసులు తాజాగా భూ కబ్జా Land grabbing కేసు నమోదు చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన సీఐ తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు మరణించిన వ్యక్తిని అందులో నిందితుడిగా చేర్చాడు. దీనిపై విచారించిన ఉన్నతాధికారులు ఆ సీఐని సస్పెండ్​ ci suspend చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే.. వరంగల్​ warangal పరిధిలోని ఏజే మిల్స్​ AJ Mills పోలీస్​ స్టేషన్​లో Police Station జె వెంకట రత్నం సీఐగా పని చేస్తున్నారు. అయితే ఓ భూ వివాదం కేసులో ఆయన బాధితులకు న్యాయం చేయకుండా తప్పుడు కేసు పెట్టారు. అంతేగాకుండా ఆ కేసులో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా చేర్చి నిందితులకు సహకరించాడు. మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్​ ఆవరణలో లైంగికంగా వేధించాడు. ఈ మేరకు విచారణ జరిపిన వరంగల్​ సీపీ warangal cp సదరు సీఐ వెంకట రత్నంను సస్పెండ్​ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.