HomeతెలంగాణPadi Kaushik Reddy | ఈటల సీఎం కావాలనుకున్నారు.. పాడి కౌశిక్​రెడ్డి​ సంచలన వ్యాఖ్యలు

Padi Kaushik Reddy | ఈటల సీఎం కావాలనుకున్నారు.. పాడి కౌశిక్​రెడ్డి​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Padi Kaushik Reddy | బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​పై బీఆర్​ఎస్​ నేత, హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ను సీఎం సీటు నుంచి దింపి ఆయన ముఖ్యమంత్రి కావాలని కుట్ర చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని.. అయితే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు(BRS MLA) ఆయన వెంట వెళ్లలేదన్నారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టిన చరిత్ర ఈటల రాజేందర్​ది అని వ్యాఖ్యానించారు.

Padi Kaushik Reddy | బీజేపీని కూడా మోసం చేస్తారు

ఈటల కేసీఆర్​పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్​ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్​(KCR)ను విమర్శించే స్థాయి ఈటలది కాదన్నారు. ఈటలకు రాజకీయ భిక్ష పెట్టిందని కేసీఆర్​ అన్నారు. అలాంటి నేతను ఈటల మోసం చేశారన్నారు. ఈటల పెద్ద మోసగాడు అని కౌశిక్​రెడ్డి (Padi Kaushik Reddy )అన్నారు. కేసీఆర్​ను, హుజురాబాద్​ ప్రజలను మోసం చేశారన్నారు. భవిష్యత్​లో బీజేపీని కూడా మోసం చేస్తారని పేర్కొన్నారు. ప్రజల భూములను లాక్కునందుకు కేసీఆర్​ ఈటల రాజేందర్​(Eatala Rajender)ను పార్టీ నుంచి తొలగించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో హుజురాబాద్​ ఎమ్మెల్యేగా ఉన్న ఈటలను అధికారిక కార్యక్రమాలకు పిలిచామన్నారు. అయితే ఆయన అహంకారంతో హాజరు కాలేదని కౌశిక్​రెడ్డి ఆరోపించారు. పైగా తనను పిలవలేదని ఇప్పుడు అబండాలు వేయడం సరికాదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

Must Read
Related News