అక్షర టుడే, కమ్మర్పల్లి: Kammarpally Mandal | మండలంలోని హసాకొత్తూరుకు (Hasakottur) చెందిన సుధాకర్ సోదరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ (In-charge Muthala Sunil Kumar) శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండగా, వారి చదువుకు తనవంతు సహకారమందిస్తానన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగు మోహన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గంగారాం కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.