ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Visakhapatnam | ఐటీ హ‌బ్‌గా విశాఖ‌.. వ‌రుస క‌ట్టిన ప్ర‌ముఖ సంస్థ‌లు

    Visakhapatnam | ఐటీ హ‌బ్‌గా విశాఖ‌.. వ‌రుస క‌ట్టిన ప్ర‌ముఖ సంస్థ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakhapatnam | ఐటీ ప‌రిశ్ర‌మ‌కు విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా మారుతోంది. స‌ముద్ర తీర ప్రాంత‌మైన ఈ ప‌ట్ట‌ణానికి ఐటీ సంస్థ‌లు వ‌రుస క‌ట్టాయి. నూత‌న పారిశ్రామిక విధానాల‌తో పాటు ప్ర‌భుత్వ ప్రోత్సాహకాలు అద్భుతంగా ఉండ‌డంతో ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. ఇప్ప‌టికే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, గూగుల్ వంటి సంస్థ‌లు విశాఖ‌(Visakhapatnam)లో త‌మ కార్యాల‌యాల‌ను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. రానున్న‌రోజుల్లో మ‌రో 15 ఐటీ కంపెనీలు కూడా ఇక్క‌డ కార్య‌కలాపాలు ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి.

    Visakhapatnam | కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు..

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లో ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వం ఐటీ రంగంపై ఫోక‌స్ చేసింది. అన్ని ర‌కాల‌గా ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించింది. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారాన్ని ఆస‌రాగా చేసుకుని వినూత్న రీతిలో ముందుకు సాగుతోంది. దీంతో ఐటీ సంస్థ‌లు విశాఖ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు (Leading IT Companies) పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రాగా, మ‌రిన్ని సంస్థ‌లు కూడా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. భౌగోళికంగా సముద్ర తీరాన ఉండడం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు (Bhogapuram Greenfield Airport) అందుబాటులోకి రానుండడం.. ఐటీ కంపెనీల రాకతో ముంబై తరహా కాస్మోపాలిటన్‌ సిటీగా విశాఖ మారుతుందని అంటున్నారు.

    Visakhapatnam | కోట్లాది పెట్టుబ‌డులు.. వేలాది కొలువులు..

    విశాఖపట్నంలో భారీగా పెట్టుబడుల విస్తరణకు శ్రీకారం చుడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) యాజమాన్యం ఇటీవ‌ల ప్రకటించింది. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రూ.1,582 కోట్ల పెట్టుబడి పెట్ట‌నున్న‌ట్లు, దీంతో 8,000 మంది యువతకు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని పేర్కొంది. ఇక‌, టీసీఎస్ కూడా విశాఖ‌కు వ‌స్తున్న‌ట్లు తెలిపింది. రూ.1,370 కోట్ల పెట్టుబడులతో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో క్యాంప‌స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కంపెనీకి ఎకరాకు 99 పైసలు చొప్పున దాదాపు 22 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    కాగ్నిజెంట్‌, టీసీఎస్ రాకతోనే దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గూగుల్ కూడా విశాఖ‌లో త‌మ ప్రస్థానాన్ని ప్రారంభించ‌నుంది. మరో 15 ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జ‌రిపాయి. రానున్న ఆర్నెళ్ల‌లో ఆయా సంస్థ‌లు కూడా విశాఖ‌లో పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశ‌ముంది.

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...