Ex MLA
Ex MLA | ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్: Ex MLA | ఇందిరమ్మ పేరుతో తెలంగాణలో హింసాత్మక రాజ్యం సాగుతోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former Armoor MLA Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర (Meenakshi Natarajan padayatra) సందర్భంగా జిల్లావ్యాప్తంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్​లో తన ఇంటి చుట్టూ, నిజామాబాద్​లోని బీఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ పోలీసులను మోహరించడం దారుణమన్నారు.

Ex MLA | ఆర్మూర్ అంటేనే రైతులు..

ఆర్మూర్​ పేరు చెబితేనే రైతులు (Farmers) గుర్తొస్తారని.. అలాంటి రైతులను అక్రమంగా అరెస్ట్​ చేయడం ఏమిటని జీవన్​ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. పాదయాత్ర చేస్తున్న మీనాక్షి నటరాజన్​ను ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.