అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు.
ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం గణే మండళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన, చేయకూడని పనులను స్పష్టంగా వివరించారు.
గణనాథులను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఇన్ఛార్జీల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Vinayaka Chavithi | మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలి
మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే భద్రతాపరంగా బాగుంటుందని సీఐ శ్రీనివాస్ సూచించారు. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇసుక, నీళ్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సౌండ్బాక్స్లు పెట్టరాదని వివరించారు.
వినాయకులను వాహనాల్లో తరలించే సమయంలో ఇనుపపైపులకు బదులుగా పీవీసీ పైప్లతోనే వైర్లను జరపాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు చిరంజీవి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న గణేష్ మండల నిర్వాహకులు