HomeతెలంగాణVinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు ఆన్​లైన్​లో సమాచారం నమోదు చేసుకోవాలి

Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు ఆన్​లైన్​లో సమాచారం నమోదు చేసుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు.

ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం గణే మండళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్​ సీఐ మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన, చేయకూడని పనులను స్పష్టంగా వివరించారు.

గణనాథులను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఇన్​ఛార్జీల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని పేర్కొన్నారు.  విద్యుత్​ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Vinayaka Chavithi |  మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలి

మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే భద్రతాపరంగా బాగుంటుందని సీఐ శ్రీనివాస్​ సూచించారు. ఫైర్​ యాక్సిడెంట్స్​ జరిగితే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇసుక, నీళ్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సౌండ్​బాక్స్​లు పెట్టరాదని వివరించారు.

వినాయకులను వాహనాల్లో తరలించే సమయంలో ఇనుపపైపులకు బదులుగా పీవీసీ పైప్​లతోనే వైర్లను జరపాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ గణేష్​ మండపాల నిర్వాహకులు చిరంజీవి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న గణేష్​ మండల నిర్వాహకులు