అక్షరటుడే, వెబ్డెస్క్: London | దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాల కనుల పండువగా సాగుతున్నాయి. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. లండన్లో వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi Utsavsavs) భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులతో ఘనంగా పూజలు జరిపారు.
ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. మనం ఎక్కడ ఉన్నా మన సంప్రదాయాలను పాటించాలన్నారు. కుల మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో అజీజ్ అన్సారీ, బండి అఖిల్, చరణ్, కార్తిక్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
