HomeతెలంగాణPCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్​లో గెలుపు మాదే.. ‘బాకీ కార్డులు’ చూసి ప్రజలు...

PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్​లో గెలుపు మాదే.. ‘బాకీ కార్డులు’ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : మహేశ్​గౌడ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్​ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్​(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు.

జూబ్లీహిల్స్​లో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇక్కడ బీఆర్​ఎస్​ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ సతీమణి సునీత పోటీ చేయనున్నారు. కాంగ్రెస్​ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే మంచి మెజారిటీతో తమ అభ్యర్థి గెలుస్తారని మహేశ్​ గౌడ్​ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) సైతం కాంగ్రెస్​ విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు.

PCC Chief Mahesh Goud | అప్పుల పాలు చేసిన కేసీఆర్​

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్​ అప్పుల పాలు చేశారని మహేశ్​గౌడ్(PCC Chief Mahesh Goud)​ విమర్శించారు. రాష్ట్రాన్ని బాకీల మయం చేసిన బీఆర్​ఎస్​ బాకీ కార్డులు పంపిణీ చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్​ హామీలు అమలు చేయడం లేదని బీఆర్​ఎస్​ నాయకులు ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పీసీసీ అధ్యక్షుడు స్పందించారు. పదేళ్లలో బీఆర్​ఎస్​ ఒక్క రేషన్​ కార్డు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చారన్నారు. ప్రజలను మోసం చేసిన బీఆర్​ఎస్​ కాంగ్రెస్​పై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

PCC Chief Mahesh Goud | హామీలు అమలు చేస్తున్నాం

రేవంత్​రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) హామీలు అమలు చేస్తోందని మహేశ్​ గౌడ్​ అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో గ్రూప్​–1 ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడినట్లా అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై బీఆర్​ఎస్​, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలని ఆయన అన్నారు.