ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

    Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bheemgal | భీమ్​గల్​ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని సీపీ క్యాంపు కార్యాలయం (nizamabad Cp Camp office) ఎదుట ఓ వ్యక్తి ఆదివారం ఆందోళనకు దిగాడు.

    బాధితుడు గుగ్లోత్​ బీను తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్​గల్​ మండలం రూప్ల తండాకు చెందిన బీను, అతని కొడుకు మధ్య ఇల్లు నిర్మాణం విషయంలో శనివారం గొడవ జరిగింది. దీంతో కొడుకు తన తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు భీమ్​గల్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి తండ్రి సైతం స్టేషన్​కు వచ్చాడు. ఈ క్రమంలో బీనును ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు లాఠీలతో తీవ్రంగా కొట్టారు. కాసేపటి తర్వాత వదిలేయడంతో బాధితుడు ఆర్మూర్​కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.

    ఆదివారం నిజామాబాద్​ సీపీ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపాడు. అనంతరం స్పెషల్ బ్రాంచి సీఐ శ్రీశైలం అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...