అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | ఓ మహిళపై నగరంలోని ప్రముఖ డెంటల్ డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా బాధితురాలు నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో (4th Town Police Station) ఫిర్యాదు చేసింది.
బాధితురాలు మాట్లాడుతూ.. తాను గతంలో ఓ ట్రావెల్స్లో పని చేశానని తెలిపింది. అప్పటి నుంచే ఓ ప్రముఖ డెంటల్ డాక్టర్, ‘ఆయిల్’ పేరిట పేరు గల రియల్ ఎస్టేట్ వ్యాపారి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. సంస్థలో పని చేస్తున్న పనుల నిమిత్తం వచ్చి తనను అసభ్యంగా తాకేవారని వాపోయింది. అయితే అప్పుడు తనకు పెళ్లికాకపోవడంతో భయపడి ఎవరికి చెప్పలేదని తెలిపింది.
అక్కడ జాబ్ మానేసిన తర్వాత కూడా వారు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. రెండేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. వీడియో కాల్స్ చేసి న్యూడ్గా మాట్లాడమంటున్నారని, తోటకు రావాలని బెదిరిస్తున్నారని తెలింది. ఈ మేరకు సోమవారం సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya)ను కలిసి ఫిర్యాదు చేశానని పేర్కొంది. ఆయన సూచన మేరకు మంగళవారం నాలుగో టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.
