ePaper
More
    HomeజాతీయంVice President Elections | అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి

    Vice President Elections | అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్​ సుదర్శన్​రెడ్డి (Justice Sudarshan Reddy) అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్​లో మాట్లాడారు.

    జగదీప్​ ధన్​ఖడ్​ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి ఈ నెల 9న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్​ పోటీ చేస్తున్నారు. సంఖ్యా బలం లేకున్నా ఇండియా కూటమి తన అభ్యర్థిగా తెలంగాణకు (Telangana) చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ సుదర్శన్​రెడ్డిని నిలిపిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు.

    Vice President Elections | ప్రతిపక్షాల అభ్యర్థిని..

    తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని.. ప్రతిపక్షాల అభ్యర్థినని సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. కూటమిలో లేకున్నా.. కేజ్రీవాల్‌ (Kejriwal) తనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది తనను అడిగారన్నారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించలేదని ఆయన చెప్పారు. నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, ఇక ముందు కూడా ఉండదని స్పష్టం చేశారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం కోసం మాట్లాడతానని పేర్కొన్నారు.

    Vice President Elections | ప్రమాదంలో రాజ్యాంగం

    తన ప్రయాణం 53 ఏళ్లుగా రాజ్యాంగంతో సాగుతోందని సుదర్శన్​రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడటమే తన ధ్యేయమన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తాను ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాజ్యాంగం కోసం పౌరులందరు మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

    Vice President Elections | సుదర్శన్​రెడ్డికి మద్దతు ఇవ్వాలి

    ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్​రెడ్డికి తెలుగు రాష్ట్రాల పార్టీలు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డి కోరారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఆయనను పోటీకి ఎంపిక చేసినట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టేలా ఆయన పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    CP Sai Chaitanya | నిర్భయంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చు: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా.. మరో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు...

    Mla Pocharam | నిజాంసాగర్ పటిష్టమైన ప్రాజెక్టు..: పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | భారీ వరదలు వచ్చినా నిజాంసాగర్​ ప్రాజెక్టు పటిష్టంగా, సురక్షితంగా ఉందని వ్యవసాయ...

    Mla Sudharshan Reddy | వరద బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

    అక్షరటుడే, బోధన్: Mla Sudharshan Reddy | వరద బాధితులను ఆదుకుంటామని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి...

    MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీశ్‌, సంతోష్ వల్లే కేసీఆర్​పై సీబీఐ ఎంక్వైరీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌  పక్కనున్న వారి వల్లే...

    More like this

    CP Sai Chaitanya | నిర్భయంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చు: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా.. మరో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు...

    Mla Pocharam | నిజాంసాగర్ పటిష్టమైన ప్రాజెక్టు..: పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | భారీ వరదలు వచ్చినా నిజాంసాగర్​ ప్రాజెక్టు పటిష్టంగా, సురక్షితంగా ఉందని వ్యవసాయ...

    Mla Sudharshan Reddy | వరద బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

    అక్షరటుడే, బోధన్: Mla Sudharshan Reddy | వరద బాధితులను ఆదుకుంటామని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి...