ePaper
More
    HomeతెలంగాణVemulawada Temple | వేములవాడలో కోడెల మృత్యువాత

    Vemulawada Temple | వేములవాడలో కోడెల మృత్యువాత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vemulawada Temple | వేములవాడ రాజన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని తరిస్తారు. రాజరాజేశ్వర స్వామి(Rajarajeshwara Swamy) వారికి సమర్పించే మొక్కుల్లో కోడె మొక్కు(Kode Mokku) ప్రధానమైంది. ఎంతో మంది రాజన్నకు కోడెలు సమర్పించుకుంటారు. అయితే భక్తులు పవిత్రంగా చెల్లించుకునే కోడె మొక్కులపై అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు సమర్పించిన కోడెల పర్యవేక్షణ లేకపోవడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 14 కోడెలు మృతి చెందాయి.

    Vemulawada Temple | సౌకర్యాలు లేక..

    స్వామి వారికి భక్తులు(Devotees) సమర్పించే కోడెలను తిప్పాపూర్ గోశాలకు అధికారులు తరలిస్తున్నారు. అయితే ఆ గోశాలలో 500 కోడెల సంరక్షణకు మాత్రమే అవకాశం ఉంది. కానీ అధికారులు అందులో 1200పైగా కోడెలను ఉంచారు. దీంతో వాటి మధ్య తొక్కిసలాటలు జరిగి చనిపోతున్నట్లు సమాచారం. శుక్రవారం 8 కోడెలు చనిపోగా.. శనివారం మరో ఆరు మృతి చెందాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కోడెలు అనారోగ్యంతో బక్క చిక్కిపోతున్నాయి.కోడె మొక్కులతో ఆలయానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా అధికారులు వాటిని పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెల మృత్యువాతపై స్పందించి కలెక్టర్​ వెటర్నరీ వైద్య బృందాన్ని గోశాలకు పంపించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...