Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

​అక్షరటుడే, భీమ్​గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గతంలో వేల్పూర్ (Velpuru) వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించి 32 మంది బీఆర్ఎస్ (BRS) నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆదివారం వేల్పూర్ పోలీస్ స్టేషన్‌కు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లిన ఆయన, పోలీసుల నుంచి నోటీసులు స్వీకరించారు. అంతకుముందు నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండాలతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ నిరసన చేపట్టారు.

Vemula Prashanth Reddy Protest | ​చట్టం రేవంత్ రెడ్డికి చుట్టమా?

వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) రాజ్‌భవన్ (Raj Bhavan) ముందు రోడ్డుపై కూర్చుని ధర్నా చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చట్టం అనేది అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఉంటుందా అని డీజీపీ (Dgp)ని నిలదీశారు. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని, అణచివేసే కొద్దీ స్ప్రింగ్‌లా పైకి లేచి ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.

Vemula Prashanth Reddy Protest | హామీలు అమలు చేయాలి

రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని వేముల విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే చేసి మిగిలిన వారిని మోసం చేశారన్నారు. యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని, యాప్‌ల పేరుతో రైతులను వేధించడం మానుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా జైల్లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.

NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం...