అక్షరటుడే, భీమ్గల్: Vemula Prashanth Reddy | మండలంలోని కుకునూర్లో వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి.
వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
