అక్షరటుడే, వెబ్డెస్క్: Vegetarians | ఆరోగ్యకరమైన శరీర నిర్మాణానికి ప్రొటీన్ (మాంసకృత్తులు) ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. అయితే, మాంసాహారం తినని వారు తమకు తగినంత ప్రొటీన్ అందడం లేదని తరచూ ఆందోళన చెందుతుంటారు.
ప్రొటీన్ పౌడర్ల protein powders వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, మనం రోజూ తినే పప్పులు, ధాన్యాలను సరైన పద్ధతిలో కలిపి తీసుకుంటే, ఖరీదైన సప్లిమెంట్ల అవసరం లేకుండానే సంపూర్ణ ప్రొటీన్ను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Vegetarians | ఎంత ప్రొటీన్ అవసరం అంటే..
సాధారణంగా ఒక వ్యక్తి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల ప్రొటీన్ను ప్రతిరోజూ తీసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీర అవసరాలు మారుతాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు కండరాల పుష్టి కోసం రోజుకు 1.2 గ్రాముల వరకు ప్రొటీన్ తీసుకోవడం అవసరం.
Vegetarians | శాకాహారంతో సంపూర్ణ ప్రొటీన్ సాధ్యమేనా..
జంతు సంబంధిత ఆహారాల్లో (మాంసం, గుడ్లు) శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. సోయాబీన్స్ మినహా మిగిలిన శాకాహార పదార్థాల్లో ఏదో ఒక అమైనో ఆమ్లం తక్కువగా ఉండటం సహజం. అందుకే శాకాహారులు ఒకే రకమైన ఆహారం తీసుకోకుండా, వివిధ రకాలను కలపి తీసుకోవాలి.
ఉదాహరణకు.. బియ్యం, గోధుమలలో ‘లైసిన్’ lysine ఉండదు. కానీ, పప్పు ధాన్యాల్లో అది పుష్కలంగా ఉంటుంది. అలాగే పప్పుల్లో లేని ‘మిథియోనిన్’ methionine తృణధాన్యాల నుంచి లభిస్తుంది. కాబట్టి, మూడు వంతుల అన్నం rice / చపాతీ chapati తో పాటు ఒక వంతు పప్పును చేర్చి తీసుకుంటే, శరీరానికి కావాల్సిన పూర్తి అమైనో ఆమ్లాలు అందుతాయి. ఈ కలయిక వల్ల శాకాహారం కూడా మాంసాహారంతో సమానమైన శక్తిని ఇస్తుంది.
ప్రొటీన్ పౌడర్లతో జాగ్రత్త!
సహజ ఆహారాన్ని కాదని, మితిమీరి ప్రొటీన్ పొడులపై ఆధారపడటం దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుంది. శరీరంలో ప్రొటీన్ జీర్ణమయ్యాక విడుదలయ్యే నత్రజనిని బయటకు పంపడానికి కిడ్నీలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మోతాదు మించితే మూత్రపిండాలపై భారం పెరిగి, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ప్రాణహానిగా మారవచ్చు. అందుకే కృత్రిమ పద్ధతుల కంటే, ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.