HomeUncategorizedVande Bharat Train | వందే భారత్​ ట్రైన్ జులై​ టికెట్లు మొత్తం బుక్​.. ఎక్కడో...

Vande Bharat Train | వందే భారత్​ ట్రైన్ జులై​ టికెట్లు మొత్తం బుక్​.. ఎక్కడో తెలుసా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vande Bharat Train | వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) వందే భారత్​ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సకల సౌకర్యాలతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్​ రైళ్లకు డిమాండ్​ ఉంది. అయితే భూతల స్వర్గం కశ్మీర్​లో వందే భారత్​ రైలు జులై నెల టికెట్లు (July Month Tickets) మొత్తం అప్పుడే బుక్​ అయిపోయాయి.

Vande Bharat Train | చీనాబ్​ వంతెన మీదాగా..

కశ్మీర్​ లోయను మిగతా దేశంతో అనుసంధానం చేయడానికి ఇటీవల చీనాబ్​ నది(Chenab River)పై రైల్వే వంతెనను ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మార్గంలో వందే భారత్​ రైలు నడుస్తోంది. కాత్రా నుంచి శ్రీనగర్​ మధ్య చీనాబ్​ రైల్వే వంతెన ద్వారా వందే భారత్​ రాకపోకలు సాగిస్తోంది. మూడు గంటల్లోనే 200 కిలోమీటర్ల దూరం ఈ రైలు వెళ్తోంది.

రెండు రైళ్లు రోజుకు మొత్తం నాలుగు ట్రిప్పులు నడుస్తున్నాయి. అయితే ఈ మార్గంలో సమయం ఆదా అవుతుండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు దీనినే ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటం, కోచ్​లు తక్కువగా ఉండటంతో ప్రయాణికులకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది. జులై నెలకు సంబంధించిన మొత్తం టికెట్లు ఇప్పటికే బుక్​ అయిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కోచ్​ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ(Railway Department) యోచిస్తున్నట్లు సమాచారం.

Vande Bharat Train | పర్యాటకుల తాకిడి

భూతల స్వర్గం.. ప్రకృతి అందాల నెలవైన కశ్మీర్​కు పర్యాటకులు భారీగా వస్తారు. సెలవు రోజులు, వారాంతాల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో వందే భారత్​ ట్రైన్​(Vande Bharat Train)కు రద్దీ పెరుగుతోంది. టికెట్లు ముందుగానే బుక్​ అవుతున్నాయి. దీంతో కోచ్​ల సంఖ్య పెంచాలని జమ్మూ కశ్మీర్​ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా(Jammu Kashmir CM Omar Abdullah) ఇటీవల రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు.

Must Read
Related News