ePaper
More
    HomeజాతీయంVande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

    Vande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వందేభారత్​ రైళ్ల (Vande Bharat Trains)ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్​ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొంది. ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైలు ఇంజిన్ (Train Engine) ముందు భాగం దెబ్బతింది. గతంలో గేదెలను ఢీకొనడంతో ఇంజిన్​ ముందు భాగం ధ్వంసం కాగా తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎద్దును ఢీకొనడంతో కొద్దిసేపు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. అనంతరం అధికారులు రైలును పంపించేశారు.

    Vande Bharat | చీరాలలో కుక్కను ఢీకొని..

    ఆంధ్రప్రదేశ్​​లోని బాపట్ల (Bapatla) జిల్లా చీరాలలో వందేభారత్‌ రైలు నిలిచిపోయింది. ట్రైన్​ కుక్కును ఢీకొనడంతో ఎయిర్‌ బ్రేక్‌కు అంతరాయం కలిగింది. దీంతో 27 నిమిషాల పాటు వందేభారత్‌ రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...