HomeUncategorizedVande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

Vande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వందేభారత్​ రైళ్ల (Vande Bharat Trains)ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్​ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొంది. ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైలు ఇంజిన్ (Train Engine) ముందు భాగం దెబ్బతింది. గతంలో గేదెలను ఢీకొనడంతో ఇంజిన్​ ముందు భాగం ధ్వంసం కాగా తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎద్దును ఢీకొనడంతో కొద్దిసేపు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. అనంతరం అధికారులు రైలును పంపించేశారు.

Vande Bharat | చీరాలలో కుక్కను ఢీకొని..

ఆంధ్రప్రదేశ్​​లోని బాపట్ల (Bapatla) జిల్లా చీరాలలో వందేభారత్‌ రైలు నిలిచిపోయింది. ట్రైన్​ కుక్కును ఢీకొనడంతో ఎయిర్‌ బ్రేక్‌కు అంతరాయం కలిగింది. దీంతో 27 నిమిషాల పాటు వందేభారత్‌ రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Read all the Latest News on Aksharatoday.in

Must Read
Related News